Pushpa 2 : అప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు దానిపైనే చర్చ.. సుకుమార్‌ థియరీ ఏంటో!

ABN , First Publish Date - 2023-09-12T21:32:12+05:30 IST

సుకుమార్‌ హీరోలకు తెరపై ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఆ పాత్రను తెరకెక్కించిన విధానంలోనూ తనదైన మార్క్‌ చూపిస్తారు. అంతే కాదు ఆ పాత్రలకు ఓ థియరీ ఉంటుంది. దాని వెనుక బలమైప రిఫరెన్స్‌ కూడా ఉంటుంది. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ పాత్రను ఎంత వైవిధ్యంగా చూపించారో.. తెలిసిందే! పుష్పలోనూ అలాంటి మార్క్‌ థియరీ చూపించారు లెక్కల మాస్టర్‌.

Pushpa 2 : అప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు దానిపైనే చర్చ.. సుకుమార్‌  థియరీ ఏంటో!

సుకుమార్‌ (Sukumar) హీరోలకు తెరపై ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఆ పాత్రను తెరకెక్కించిన విధానంలోనూ తనదైన మార్క్‌ చూపిస్తారు. అంతే కాదు ఆ పాత్రలకు ఓ థియరీ ఉంటుంది. దాని వెనుక బలమైప రిఫరెన్స్‌ కూడా ఉంటుంది. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ పాత్రను ఎంత వైవిధ్యంగా చూపించారో.. తెలిసిందే! పుష్పలోనూ (Pushpa 2) అలాంటి మార్క్‌ థియరీ చూపించారు లెక్కల మాస్టర్‌. అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 సినిమా నుంచి ‘వేర్‌ ఈజ్‌ పుష్ప’ పేరుతో ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే! అందులో హీరో చేతి గోరును హైలైట్‌ చేశారు. అయితే అప్పట్లో దాని గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో మళ్లీ అదే గోరును హైలైట్‌ చేస్తూ చూపించడంతో దాని వెనుక ఏదో ఉందంటూ సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. దీనిలోనూ చిటికెన వేలు గోరును హైలైట్‌ చేశారు. దాని వెనక ఓ థియరీ ఉందని చెబుతున్నారు. కొన్ని సంస్కృతుల్లో తమ సంపదను, సమాజంలో స్థానాన్ని చూపించేందుకు చిటికెన వేలు గోరు పెంచుకుంటారట. అంతేకాదు, కేవలం రూల్‌ చేయడానికి మాత్రమే తాము ఉన్నట్లు గుర్తుగా చూపించడానికి కూడా పెంచుతారని పలువురు చెబుతున్నారు.

అయితే ఈ సినిమా విషయానికొస్తే.. ఎర్ర చందనం వ్యాపారాన్ని చిటికెన వేలుపై నిలబెట్టి చేయడగలడని సూచనగా దాన్ని హైలైట్‌ చేస్తున్నట్టు వినిపిస్తోంది. సుకుమార్‌ తెరకెక్కించే ప్రతి సీన్‌కు ఓ లాజిక్‌, కొన్ని రిఫరెన్స్‌లు ఉంటాయి. ‘రంగస్థలం’లో జగపతిబాబు పాత్రకు పామును రిఫరెన్స్‌గా తీసుకున్నారు. సినిమా ప్రారంభంలో పామును ఏ విధంగా అయితే కొట్టి చంపుతారో అలాగే జగపతిబాబుని కూడా అలాగే కొట్టి చంపినట్లు చూపించారు. మరి ఇప్పుడు అల్లు గోరును హైలైట్‌ చేయడం వెనుక ఏముందో సుకుమార్‌ చెబితేనే బాగుంటుంది. అల్లు అర్జున్‌, (Allu arjun) రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న ఈ చిత్రాన్ని విడుడల చేయబోతున్నారు.

Updated Date - 2023-09-12T21:34:48+05:30 IST