SSMB29: ప్రత్యేకమైన రోజున ప్రారంభం

ABN , First Publish Date - 2023-06-13T12:17:42+05:30 IST

‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి భారీ చిత్రాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి చేయబోతున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’. సూపర్‌స్టార్‌ మహేశ్‌తో జక్కన్న చేయబోతున్న తొలి చిత్రమిది. అయితే తాజా సమాచారం ప్రకారం ఓ ప్రత్యేకమైన రోజున ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారని తెలిసింది.

SSMB29: ప్రత్యేకమైన రోజున ప్రారంభం

‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)వంటి భారీ చిత్రాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి చేయబోతున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’(SSMB29). సూపర్‌స్టార్‌ మహేశ్‌తో (Maheshbabu)జక్కన్న చేయబోతున్న తొలి చిత్రమిది. సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చిన నెలలు గడుస్తున్నా.. పూజా కార్యక్రమాలు, షూటింగ్‌ ప్రారంభం తదితర విషయాలపై ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. మహేశ్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా చిత్రీకరణ కూడా నత్తనడకన సాగుతుంది. మహేశ్‌ ఫ్యామిలీ టూర్స్‌... ఇతర సినిమాల కాంబినేషన్స్‌ సెట్‌ చేయడంలో త్రివిక్రమ్‌ బిజీగా ఉంటున్నారనే టాక్‌ ఈ మధ్యన బాగా వినిపిస్తోంది. దాని వల్లే మహేశ్‌ - రాజమౌళి (SS Rajamouli) చిత్రం కూడా వెనక్కి జరుగుతుందనే టాక్‌ వినిపిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఓ ప్రత్యేకమైన రోజున ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారని తెలిసింది.

మహేశ్‌ పుట్టినరోజు అభిమానులకు ఏదో ఒక సర్‌ప్రైజ్‌ ఇస్తుంటారు. ఈ ఏడాది బర్త్‌డేకి జక్కన్నతో సినిమాను షురూ చేయనున్నారట ప్రిన్స్‌. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 9 మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా లాంచ్‌ చేయనున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్న రెండు వారాల్లో వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం స్ర్కిప్ట్‌ పనుల్లో రాజమౌళి అండ్‌ టీమ్‌ ఉంది. ఈ చిత్రంలో కూడా భారీ స్టార్‌క్యాస్ట్‌ ఉండబోతోంది. బాలీవుడ్‌ నటులతోపాటు హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ నిర్మించనున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు.

Updated Date - 2023-06-13T12:17:42+05:30 IST